చిత్రసీమ ఎక్కడైనా ఒక్కటే: రష్మిక

తన అభినయం, అందంతో ఆకట్టుకుంటున్న దక్షిణాది నటి రష్మిక మందన. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’, హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’లో నటిస్తోంది. ‘‘హిందీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమ ఏదైనా సరే చేసే పనిలో ఎలాంటి తేడా లేదని’’ చెబుతోంది.

Published : 21 Apr 2021 01:39 IST

ఇంటర్నెట్ డెస్క్: తన అభినయం, అందంతో ఆకట్టుకుంటున్న దక్షిణాది నటి రష్మిక మందన. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో అమితాబ్‌తో కలిసి ‘గుడ్‌బై’, హీరో సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్ను’లో నటిస్తోంది. ‘‘హిందీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమ ఏదైనా సరే చేసే పనిలో ఎలాంటి తేడా లేదని’’ చెబుతోంది. ‘‘ప్రతి చిత్రబృందం, అందులోని నటీనటులు, దర్శకుడు భిన్నంగా పనిచేస్తుంటారు. అదే నటీనటులు మరొక సినిమాలో కలిసి పనిచేసినప్పుడు భిన్నంగా పనిచేస్తారని నమ్ముతున్నా. వ్యక్తులే భిన్నంగా ఉంటారు కానీ చిత్రసీమ మాత్రం అంతటా ఒకేలా ఉంటుంది. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరం కథకులం మాత్రమే. కొవిడ్‌కి ముందు దక్షిణాదిలో సినిమాలు చేస్తున్నప్పుడు తీరిక లేదు. అప్పుడు బాలీవుడ్‌లో చిత్రాల్లో నటించాలని భావించలేదు. ఒక్కసారిగా కొవిడ్‌తో చిత్రసీమలో కొత్త చిత్రాల నిర్మాణం మందగించింది. అప్పుడే ఇతర భాషల్లో సినిమాలు చేయడానికి  ఇదే సరైన సమయంగా భావించా. అందుకే హిందీలో ‘గుడ్‌బై’, ‘మిషన్‌ మజ్ను’లాంటివి చేస్తున్నా. అంతకంటే మరొక కారణం లేదని’’ తెలిపింది. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో కథానాయికగా నటిస్తోంది. ఆగస్టులో 13న చిత్రం విడుదల కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని