Ori Devuda: అదే ‘ఓరి దేవుడా’ ప్రత్యేకత!
‘‘కథతోపాటు... నటుల బలాల్ని ఆధారంగా చేసుకుని పాత్రల్ని కూడా కొత్తగా డిజైన్ చేశారు దర్శకుడు. మాతృక చూసినా సరే, మరో కొత్త తెలుగు సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు పంచుతాం’’ అన్నారు మిథిలా పాల్కర్, ఆశాభట్.
‘‘కథతోపాటు... నటుల బలాల్ని ఆధారంగా చేసుకుని పాత్రల్ని కూడా కొత్తగా డిజైన్ చేశారు దర్శకుడు. మాతృక చూసినా సరే, మరో కొత్త తెలుగు సినిమా చూసిన అనుభూతిని ప్రేక్షకులకు పంచుతాం’’ అన్నారు మిథిలా పాల్కర్ (Mithila Palkar), ఆశాభట్. ‘ఓరి దేవుడా’ (Ori Devuda) చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న కథానాయికలు వీళ్లు. విష్వక్సేన్ కథానాయకుడిగా, అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మిథిలా, ఆశాభట్ మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
మిథిలా పాల్కర్: ‘‘సినిమాలో అను అనే యువతిగా కనిపిస్తా. నాకు అలవాటైన పాత్రే. తెలుగులో నాకు ఇదే తొలి చిత్రం. భాష కొత్త కాబట్టి, ఇక్కడ నాకు అలవాటైన పాత్ర దొరకడంతో చాలా మేలయ్యింది. భాషపైనా, భావోద్వేగాలపైనా దృష్టిపెట్టా. స్నేహం, ప్రేమ, పెళ్లి విషయంలో రెండో అవకాశం తదితర విషయాల్ని వినోదాత్మకంగా చర్చించే ఓ మంచి కథ ఇది. దర్శకుడు అశ్వథ్ నాతో ఆర్నెళ్లపాటు టచ్లో ఉంటూ ఈ కథ చెప్పారు. ఆయన కథ చెప్పాక తమిళంలో వచ్చిన ‘ఓ మై కడవులే’ని చూశా. చాలా నచ్చింది. కానీ దర్శకుడు ఈ సినిమాని పక్కా తెలుగు సినిమాలా తీర్చిదిద్దారు. నా నట ప్రయాణం ఎక్కువగా అంతర్జాలంతోనే ముడిపడింది. యూ ట్యూబ్, నెట్ఫ్లిక్స్ వేదికల్లో వెబ్ సినిమాలు ఎక్కువగా చేసి గుర్తింపు పొందా. ‘కట్టి బట్టి’తోపాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. మరోసారి పెద్ద తెరతో ప్రేక్షకుల్ని పలకరిస్తుండడం ఆనందంగా, ఆత్రుతగా ఉంది. వెంకటేష్ సర్ ఇందులో కీలక పాత్ర చేశారు. కానీ ఆయనతో నటించే అవకాశమే నాకు దక్కలేదు. కథానాయకుడు విష్వక్సేన్, నిర్మాణ సంస్థ పీవీపీతో ప్రయాణం గుర్తుండిపోతుంది’’.
ఆశాభట్: ‘‘నేను కన్నడ అమ్మాయిని. భద్రావతిలో పుట్టి పెరిగాను. ఇందులో మీరా అనే యువతిగా కనిపిస్తా. సహాయ దర్శకురాలి పాత్ర నాది. ఈ ప్రాజెక్ట్లోకి విష్వక్, మిథిలా తర్వాత నేను వచ్చా. కన్నడ చిత్రం ‘రాబర్ట్’ తర్వాత మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్నప్పుడు దర్శకుడు అశ్వథ్, నిర్మాత పీవీపీ నాకు ఈ కథ చెప్పారు. వెంటనే ఒప్పుకున్నా. ‘ఓ మై కడవులే’ నేను చూశా. కానీ ఏ ఒక్క పాత్ర, సన్నివేశం కూడా ఒకేలా అనిపించదు. అదే ఈ సినిమా ప్రత్యేకత. నా బలం డ్యాన్స్. దాన్ని హైలెట్ చేస్తూ దర్శకుడు నా పాత్రని డిజైన్ చేశారు. నా ఒక్క పాత్రే కాదు, అన్ని విషయాలపైనా మరో కొత్త సినిమా చేస్తున్నట్టుగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తెరకెక్కించారు దర్శకుడు. ఇందులో పూరి జగన్నాథ్ ఓ పాత్రలో కనిపిస్తారు. ఆయనతో కలిసి నటించడం మంచి అనుభవం. కన్నడ అమ్మాయినే కాబట్టి తెలుగు కష్టం అనిపించలేదు. మిథిలా, నేను సెట్లో ఎప్పుడు కలిసినా ఆడుతూపాడుతూ గడిపేవాళ్లం. మా ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. తదుపరి చేయనున్న సినిమా వివరాల్ని ఈ సినిమా విడుదల తర్వాత ప్రకటిస్తా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న... కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్