Ram Charan: ‘రంగస్థలం’ తర్వాత మరోసారి...

గురు శిష్యులు సుకుమార్‌, బుచ్చిబాబు సానాలతో వరుసగా సినిమాలు చేయనున్నారు రామ్‌చరణ్‌.

Updated : 22 Mar 2024 10:58 IST

గురు శిష్యులు సుకుమార్‌, బుచ్చిబాబు సానాలతో వరుసగా సినిమాలు చేయనున్నారు రామ్‌చరణ్‌. సుకుమార్‌ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న సినిమా బుధవారమే పట్టాలెక్కింది. ఇది రామ్‌చరణ్‌కి 16వ చిత్రం. ఆయన 17వ చిత్రమేమో సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌ - సుకుమార్‌ కలిసి చేస్తున్న సినిమా ఇదే. ఈ నెల 27న రామ్‌చరణ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగానే ఆ సినిమాని అధికారికంగా ప్రకటించనున్నారు. సుకుమార్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ కథానాయకుడిగా ‘పుష్ప 2’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే రామ్‌చరణ్‌ చిత్రం కోసం రంగంలోకి దిగనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమాని పూర్తి చేశాక, సుకుమార్‌, బుచ్చిబాబు సానా సినిమాలతోనే రామ్‌చరణ్‌ ప్రయాణం చేయనున్నారు  

ప్రతినాయకుడిగా సంజయ్‌దత్‌?

రామ్‌చరణ్‌ - బుచ్చిబాబు సానా కలయికలో రూపొందుతున్న సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో  తెరకెక్కుతోంది.  అందుకు తగ్గట్టే తారాగణాన్ని ఎంపిక చేసుకొంటున్నారు. కథానాయికగా జాన్వీ కపూర్‌ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ నటిస్తున్నారు. ఇందులో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్‌ సంజయ్‌దత్‌ నటించనున్నట్టు సమాచారం. క్రీడా నేపథ్యంతో ముడిపడిన ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని