Renu Desai: ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో.. నాకు ఈ అవకాశం వచ్చింది: రేణూ దేశాయ్
‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ప్రమోషన్స్లో భాగంగా రేణూ దేశాయ్ (Renu Desai) తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. హేమలత లవణం పాత్రలో నటించడంపై స్పందించారు.
హైదరాబాద్: 1970 ప్రాంతంలో స్టూవర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా వంశీ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 18 ఏళ్ల విరామం తర్వాత నటి రేణూదేశాయ్ (Renu Desai) ఈ సినిమాతో వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె గుర్రం జాషువా కుమార్తె, సామాజికవేత్త ‘హేమలత లవణం’గా కనిపించనున్నారు. ఇలాంటి పాత్రలో నటించడంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు స్పదించారు.
‘‘కథ, దర్శక - నిర్మాతల వల్లే నేను ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నా. హేమలత లవణం పాత్రలో నటించడానికి మొదట నేనెంతో భయపడ్డా. ఆ పాత్రకు వందశాతం న్యాయం చేయగలనా? లేదా? అనుకున్నా. వంశీ, టీమ్ సపోర్ట్ చేయడంతోనే ఇది సాధ్యమైంది. ఏదో జన్మలో చేసిన పుణ్యఫలం వల్లే ఈ పాత్ర పోషించే అవకాశం దక్కింది. నా పోస్టర్ చూసిన తర్వాత అకీరా ఎంతో ఆనందించాడు. ‘చాలామంది నటీమణులు వాళ్ల వయసుకు తగ్గ పాత్రల్లో నటించడానికి ఆసక్తి కనబరచడం లేదు. స్క్రీన్పై యంగ్గా కనిపించాలనుకుంటున్నారు. కానీ, నువ్వు నీ వయసుకు తగ్గ పాత్ర చేశావు. అందుకు నేను ఎంతో గర్వపడుతున్నా’ అని ఆద్య చెప్పింది. నా రోల్ పట్ల వాళ్లు సంతోషంగా ఉన్నందుకు ఆనందంగా అనిపించింది’’
‘‘హేమలత లవణం పాత్ర నాతో ఎంతో మార్పు తెచ్చింది. చిన్న పిల్లలు ఎవరూ ఆకలితో ఉండకూడదనేది నా లక్ష్యం. అందుకోసం శ్రమించాలనుకుంటున్నా. ఇక, రవితేజతో కలిసి వర్క్ చేయడాన్ని ఎప్పటికీ మర్చిపోను. ఆయన మంచి వ్యక్తి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన గురించి ఎన్నో విషయాలు చెబుతా. నా నిర్మాతలు నన్నొక కుటుంబసభ్యురాలిగా చూసుకున్నారు. సినిమా విషయంలో ఒత్తిడికి గురి చేయలేదు’’ అని ఆమె చెప్పారు.
అకీరా తెరంగేట్రంపై మాట్లాడుతూ.. ‘‘మ్యూజిక్, ఫిల్మ్ ప్రొడక్షన్ కోర్సులతోపాటు స్క్రిప్ట్ రైటింగ్పై ప్రస్తుతానికి అకీరా ఫోకస్ చేస్తున్నాడు. నటనవైపు అడుగువేయాలని అతడు అనుకోవడం లేదు. అలాగే నేను కానీ, పవన్కల్యాణ్ కానీ యాక్టర్గా మారమని అకీరాను బలవంతం చేయడం లేదు. తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని లక్షణాలు తనలో ఉన్నాయి. నేను ఒక నటిని. వాళ్ల నాన్న, పెదనాన్న యాక్టర్స్. నా తనయుడిని వెండితెరపై చూడాలని నాకు ఆశగా ఉంది. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి.’’ అని ఆమె తెలిపారు.
Sitara: సినిమా.. నా డీఎన్ఏలోనే ఉంది: సితార
రచయిత, సంఘ సంస్కర్త గుర్రం జాషువా కుమార్తె.. హేమలతా లవణం. ఆమె తన భర్త గోపరాజు లవణంతో కలిసి అంటరానితనం - కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు. జోగిని దురాచార నిర్మూలన - నేరస్థుల సంస్కరణల కోసం అవిరళ కృషి చేశారు. బందిపోట్ల సంస్కరణ కోసం మధ్యప్రదేశ్ అడవుల్లో పాదయాత్ర చేశారు. ఎంతో మంది దొంగలు తమ వృత్తిని వీడి సామాన్య జీవనం గడపడానికి హేమలత కృషి చేశారు.
టైగర్ నాగేశ్వరరావు గురించి ఎన్నో కథలు విని.. వాటిని ప్రేక్షకులకూ తెలియజేయాలనే ఉద్దేశంతో వంశీ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ దీనిని నిర్మిస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలు. అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బధిరుల భాషలోనూ విడుదల కానున్న తొలి తెలుగు చిత్రమిదే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. -
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
తనను ఇన్స్టా ఇన్ఫ్లూయెన్సర్ అనడంపై ఆశ్చర్యం వ్యక్తంచేశారు నటి శివానీ రాజశేఖర్. -
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ షూటింగ్ అనుభవాలను జాన్వీ కపూర్ పంచుకున్నారు. -
అసలైన విజయమంటే అదే.. బర్త్డే రోజు రామ్ ఆసక్తికర పోస్ట్
మనకు నచ్చింది చేయగలగడమే అసలైన విజయమని రామ్ పోతినేని అన్నారు. -
ఇలా చేయడం సరికాదు: ‘సెపరేషన్’ పోస్ట్ ట్రోల్స్పై జీవీ ప్రకాశ్
తనపై కొందరు ట్రోల్స్ చేయడం బాధగా ఉందని సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ పేర్కొన్నారు. -
విమర్శలు వచ్చినా.. ‘యానిమల్’ హిట్కు కారణమిదే: మనోజ్ బాజ్పాయ్
సినిమాలు చూడాలా, లేదా అనే విషయంలో ప్రేక్షకులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్ అన్నారు. -
తప్పుడు వార్తలపై మెహరీన్ అసహనం.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
తనపై తప్పుడు వార్తలు ప్రచురించడంపై నటి మెహరీన్ అసహనం వ్యక్తం చేశారు. -
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
పారితోషికం విషయంలో హీరోయిన్లు పోరాటం చేస్తున్నారని నటి సోనాక్షి సిన్హా అన్నారు. -
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
ముంబయిలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక తన అనుభూతిని షేర్ చేసుకున్నారు. -
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫొటోలు మీకోసం.. -
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్కు ఆహ్వానం
‘భరత్ అనే నేను’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ నటి కియారా అడ్వాణి. ఆమె అరుదైన అవకాశం దక్కింది. -
పిల్లల జీవితాన్ని ఎవరు రిస్క్లో పెట్టమన్నారు: రష్మి
తాండూరులో చిన్నారిపై పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి యాంకర్ రష్మిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులకు ఆమె తిరిగి సమాధానం ఇచ్చారు. -
రూ.కోటి విరాళమిచ్చిన ధనుష్.. దేనికోసమంటే!
హీరో ధనుష్ (Dhanush) రూ.కోటి విరాళం అందించారు. -
హాలీవుడ్ ‘డ్యూన్..’ వెబ్ సిరీస్లో టబు.. ఏపాత్రలో అంటే!
ప్రముఖ నటి టబు హాలీవుడ్ వెబ్ సిరీస్లో కీలకపాత్రలో నటించనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా