అక్షయ్‌ ‘సూర్యవంశీ’ మరోసారి వాయిదా!

అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలు

Published : 05 Apr 2021 19:02 IST

ముంబయి‌: అక్షయ్‌కుమార్‌, కత్రినాకైఫ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్‌, అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలు పోషించారు. పోలీస్‌ కథ నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించారు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్ర విడుదలను మరోసారి వాయిదా వేశారు.

తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 30న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘సూర్యవంశీ’ విడుదల తాత్కాలికంగా వాయిదా వేశారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని