Sai Dharam Tej: ఏడేళ్ల క్రితం ఇదేరోజు.. సాయిధరమ్‌ తేజ్‌ లైఫ్‌లో ఏం జరిగిందంటే? 

నటుడిగా సాయిధరమ్‌ తేజ్‌ ఏడేళ్ల క్రితం ఇదే రోజున తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ చిత్రంతో 2014 నవంబరు 14న హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

Published : 14 Nov 2021 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడిగా సాయిధరమ్‌ తేజ్‌ ఏడేళ్ల క్రితం ఇదే రోజున తెలుగు ప్రేక్షకులకి పరిచయమయ్యారు. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ చిత్రంతో 2014 నవంబరు 14న హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ‘నేను నటుడవ్వాలనే నా కల ఏడేళ్ల క్రితం ఇదే రోజున నిజమైంది. హీరోగా నన్ను మీరంతా అంగీకరించారు. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ నాకు తోడుగా నిలిచారు. నాపై ఇంత ప్రేమ కురిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. 

ఈ చిత్రానికి ఎ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించారు. సాయిధరమ్‌ తేజ్‌.. శ్రీను అనే పాత్రలో సందడి చేశారు. తొలి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకున్నారు. నటనతోనే కాకుండా డ్యాన్సుతోనూ విశేషంగా అలరించారు. సాయిధరమ్‌ తేజ్‌ సరసన రెజీనా నటించింది. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన తొలి చిత్రం ‘రేయ్‌’ అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యమైంది. దాంతో రెండో సినిమా ‘పిల్లా..’ ముందుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘రేయ్‌’ చిత్రానికి వైవీఎస్‌ చౌదరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2015లో విడుదలైంది. సాయిధరమ్‌ తేజ్‌ సెప్టెంబరులో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన పూర్తిగా కోలుకున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని