రణ్బీర్తో ‘బుల్బుల్’ తార?
రణ్బీర్కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘కబీర్సింగ్’ తర్వాత హిందీలో తెరకెక్కిస్తున్న
ముంబయి: రణ్బీర్కపూర్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘యానిమల్’. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘కబీర్సింగ్’ తర్వాత హిందీలో తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో పరిణీతి చోప్రా ఓ నాయికగా నటిస్తోంది. ఇందులో మరో ఇద్దరు భామలకు చోటుందట. అందులో భాగంగానే బాలీవుడ్ నాయిక తృప్తి డిమ్రీని ఎంపిక చేసినట్టు సమాచారం.
అనుష్కశర్మ నిర్మించిన ‘బుల్బుల్’ చిత్రంలో నాయికగా ఆకట్టుకున్న తృప్తి అంతకుముందు ‘లైలా మజ్ను’, ‘పోస్టర్బాయ్స్’ చిత్రాల్లో నటించింది. ‘యానిమల్’ కోసం సారా అలీఖాన్తో పాటు పలువురినిని ఆడిషన్ చేసి వాళ్లలో తృప్తి అయితే కథకు బాగా సరిపోతుందని ఆమెను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో నటిస్తున్న పరిణీతి చోప్రా, తృప్తిలతో రణ్బీర్ చేస్తున్న తొలి చిత్రమిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్