అమెరికా డ్రీమ్కు గుడ్బై.. కెనడాకు భారత్ టాలెంట్
అమెరికాలో చదువు, ఉద్యోగం.. ఒకప్పుడు భారతీయుల కల. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారతీయ నిపుణులతో పాటు విదేశీ చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థుల
కాలం చెల్లిన వలస విధానమే కారణమంటోన్న నిపుణులు
వాషింగ్టన్: అమెరికాలో చదువు, ఉద్యోగం.. ఒకప్పుడు భారతీయుల కల. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గత కొన్నేళ్లుగా భారతీయ నిపుణులతో పాటు విదేశీ చదువులకు వెళ్లాలనుకునే విద్యార్థుల చూపు కెనడావైపు మళ్లింది. మరి దీనికి కారణం ఏంటీ అంటే.. అగ్రరాజ్య మూస వలస విధానాలే అంటున్నారు అక్కడి నిపుణులు. ముఖ్యంగా వీసాల జారీలో ‘దేశాల కోటా’ వలసదారులకు ఇబ్బందిగా మారిందని, ఈ నేపథ్యంలోనే ప్రత్యామ్నాయ మార్గంగా భారత టాలెంట్ కెనడాకు మళ్లుతోందని పేర్కొంటున్నారు.
అమెరికా వలస విధానాలపై నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్టార్ట్ అండర్సన్ ఇటీవల ఓ నివేదిక రూపొందించి దాన్ని వలసలు, పౌరసత్వ సబ్ కమిటీ హౌస్ జ్యుడీషియరీ కమిటీకి సమర్పించారు. కాలం చెల్లిన వలస విధానాల కారణంగా గత దశాబ్ద కాలంగా విదేశీ నిపుణులు, విద్యార్థులు అమెరికాను కాదని కెనడాను ఎంచుకుంటున్నారని పేర్కొన్నారు.
‘‘సాధారణంగా అమెరికా విశ్వవిద్యాలయాల్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో దాదాపు 75శాతం విద్యార్థులు విదేశీయులే అయి ఉంటారు. 2016-17 విద్యా సంవత్సరంలో చేరిన విదేశీ విద్యార్థుల్లో రెండొంతుల మంది భారత్కు చెందినవారే. కానీ ఆ తర్వాత నుంచి ఈ సంఖ్య తగ్గుతూ వస్తోంది. 2018-19 అకడమిక్ సంవత్సరం నాటికి అమెరికా యూనివర్శిటీల్లో విదేశీ విద్యార్థుల సంఖ్య 25శాతానికి పైగా పడిపోయింది. అదే సమయంలో కెనడా విశ్వవిద్యాలయాల్లో భారత విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2016లో కెనడా యూనివర్శిటీల్లో 76,075 మంది భారతీయ విద్యార్థులుండగా.. 2018 నాటికి ఆ సంఖ్య 127శాతం పెరిగి 1,72,625కు చేరింది’’ అని అండర్సన్ తన నివేదికలో వెల్లడించారు.
‘‘హెచ్-1బీ వీసాలు దొరకడం, గ్రీన్కార్డుల జారీలో ఎదురవుతున్న ఇబ్బందులే ఇందుకు ప్రధాన కారణంగా కన్పిస్తోంది. అమెరికా వలస విధానాలను 1990లో రూపొందించారు. ఆ తర్వాత ప్రపంచం ఎంతో మారింది. స్మార్ట్ఫోన్లు, ఇ-కామర్స్, సోషల్మీడియా, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ వినియోగం అందుబాటులోకి వచ్చింది. దీంతో సాంకేతిక నిపుణులకు డిమాండ్ పెరిగింది. కానీ 1990 నుంచి అమెరికా వలసవిధానం మాత్రం మారలేదు. ఉదాహరణకు, 2021 మార్చిలో 3లక్షలకు పైగా హెచ్-1బీ దరఖాస్తులు వచ్చాయి. కానీ పరిమితి కారణంగా కేవలం 85వేల మందికి మాత్రమే వీసాలు జారీ అయ్యాయి. అంటే 72శాతానికి పైగా విదేశీ నిపుణులను మనం తిరస్కరించాం. అలాంటి వారంతా కెనడాను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు’’ అని అండర్సన్ వివరించారు. మరోవైపు కెనడా వలస విధానాలు అమెరికాలో పోలిస్తే ఉత్తమంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా కాంగ్రెస్ కలగజేసుకుని వలస విధానాలను మార్చాలని, లేదంటే ఎంతోమంది నిపుణులను కోల్పోవాల్సి వస్తుందని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100% వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది. -
జేఈఈ మెయిన్స్ ఆలిండియా టాపర్గా రైతు బిడ్డ
మహారాష్ట్రలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ రైతుబిడ్డ జేఈఈ మెయిన్స్ అఖిల భారతస్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. -
ఎవరెస్ట్ బేస్ క్యాంప్నకు ఆరేళ్ల బాలుడు
హిమాచల్ప్రదేశ్లోని బిలాస్పుర్కు చెందిన ఆరేళ్ల బాలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరం బేస్ క్యాంప్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. బిలాస్పుర్ జిల్లాలోని జుఖాలా ప్రాంతానికి చెందిన యువన్ తల్లిదండ్రులతో కలిసి దుబాయ్లో ఉంటున్నాడు. -
వామపక్ష తీవ్రవాదం కట్టడికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల పైమాటే!
దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. ఈ మేరకు గత ఐదేళ్లలో.. ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా వెచ్చించింది. -
నోటా విజేతగా నిలిస్తే?
సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే ఏం చేయాలనే విషయమై చర్చకు తావిచ్చేలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి దాఖలైంది. -
చట్టం లేకుండా ఎల్వోసీలు జారీ చేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే
రుణ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై.. నిర్దిష్ట చట్టమేదీ లేకుండానే ప్రభుత్వరంగ బ్యాంకుల వినతి మేరకు సర్కారు లుకౌట్ సర్క్యులర్లు (ఎల్వోసీ) జారీ చేయడం వ్యక్తుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. -
సందేశ్ఖాలీలో భారీగా ఆయుధాల స్వాధీనం
పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీలో సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు.. తృణమూల్ కాంగ్రెస్ బహిష్కృత నేత షాజహాన్ షేక్ బంధువు ఇంటి నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. -
2025 నుంచి ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలను నిర్వహిస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. -
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?