కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు: లక్ష్మణ్
రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు.
హైదరాబాద్: రాష్ట్రానికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ అన్ని రంగాల్లో సహకరిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. దోచుకోవడానికి అవకాశం లేకుండా పోతుందని.. నూతన విద్యుత్ బిల్లుపై దష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం వాటా కింద ఇప్పటివరకు రూ.70 వేల కోట్లు తెలంగాణకు కేటాయించిందన్నారు. కేంద్ర సర్కార్ నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధులు రాలేదా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కనీస అవగాహన లేకుండా నిరాశ, నిస్ఫృహతో కేంద్రపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే సంకల్పంతో తీసుకొచ్చిన నూతన వ్యవసాయం చట్టంపై సీఎం కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు తమ పంటను నచ్చిన చోట అమ్ముకునే స్వేచ్ఛను కల్పిస్తూ కేంద్రం బిల్లు తెస్తే.. తమకు అనుయాయులుగా ఉన్న దళారులకు నష్టం కలుగుతుందనే కారణంతో అనవసర విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం