జగన్ అండతోనే రెచ్చిపోతున్నారు: చంద్రబాబు
ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ...
అమరావతి: ఓం ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేయడాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. పార్టీ దళిత నాయకులతో శనివారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
‘‘తెదేపా కోరడం వల్లే ఓం ప్రతాప్ మృతదేహానికి శవపరీక్ష చేశారు. హడావుడిగా అంత్యక్రియలు జరపడం ఒక తప్పు. రహస్యంగా శవపరీక్ష జరపడం మరో తప్పు. మృతుడి చరవాణిని పోలీసులే తీసుకోవడం మరో తప్పు. కేసు లేకపోతే ఓం ప్రతాప్ చరవాణిని ఎందుకు తీసుకెళ్లారు? మృతుడు ఓం ప్రతాప్ ఫోన్కాల్ జాబితా బయటపెట్టాలి. బెదిరింపులు, ప్రలోభాలతో జరిగిన నేరం దాయలేరు’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
చిత్తూరులో దళితులపై దాడులకు పెద్దిరెడ్డే కారణమని ఆరోపించారు. శిరోముండనాల ఘటనలు మానవత్వానికి సిగ్గు చేటన్న చంద్రబాబు.. తూర్పుగోదావరి జిల్లా ఘటనలో నిందితుడిని అరెస్టు చేస్తే ఇప్పుడు విశాఖలో జరిగేదా అని ప్రశ్నించారు. వరుస శిరోముండనాలకు సీఎం జగన్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ అండతోనే జిల్లాల్లో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిందని గుర్తు చేశారు. తమ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశామని చంద్రబాబు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434