రాంవిలాస్ మృతిపై దర్యాప్తు చేపట్టాలి: మాంఝీ
అనారోగ్యంతో కన్నుమూసిన లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాం విలాస్ పాసవాన్ మృతిపై జ్యుడిషియల్ దర్యాప్తు చేపట్టాలంటూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది
ఖండించిన చిరాగ్
పట్నా: అనారోగ్యంతో కన్నుమూసిన లోక్జన శక్తి పార్టీ(ఎల్జేపీ) వ్యవస్థాపక అధ్యక్షుడు రాం విలాస్ పాసవాన్ మృతిపై జ్యుడిషియల్ దర్యాప్తు చేపట్టాలంటూ బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంఝీ డిమాండ్ చేయడం వివాదానికి దారితీసింది. మాంఘీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎల్జేపీ అధ్యక్షుడు, రాంవిలాస్ కుమారుడు చిరాగ్ పాసవాన్.. ఇదంతా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుట్ర అని ఆరోపించారు. అసలేం జరిగిందంటే..
రాంవిలాస్ మృతిపై జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించాలంటూ మాంఝీ.. ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆయన మృతిపై తనకు అనుమానాలున్నాయని పేర్కొన్నారు. రాంవిలాస్ అంత్యక్రియల్లో చిరాగ్ నవ్వుతూ కన్పించడాన్ని ఆయన ప్రశ్నించారు. రాంవిలాస్ ఆసుపత్రిలో చేరిన తర్వాత ఒక్క హెల్త్ బులిటిన్ కూడా ఎందుకు విడుదల చేయలేదని అడిగారు.
కాగా.. మాంఝీ లేఖపై చిరాగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ సీఎంకు అనుమానాలుంటే ప్రధాని మోదీనే నేరుగా అడగొచ్చని అన్నారు. ప్రధాని మోదీ తనకు ప్రతిరోజూ ఫోన్ చేసి తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారని చిరాగ్ చెప్పారు. ఇదంతా సీఎం నితీశ్ కుమార్ కుట్రే అని, ఎన్నికల సమయంలో తనను చెడుగా చూపించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఆసుపత్రిలో ఉన్నారని తెలిసి ఒక్కసారి కూడా మాంఝీ పరామర్శించలేదని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం