రాజస్థాన్లో రాష్ట్రపతి పాలనకు డిమాండ్..!
రాజస్థాన్ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. భాజపా నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లుగా పేర్కొంటూ...
లఖ్నవూ: రాజస్థాన్ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. భాజపా నేతలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగించినట్లుగా పేర్కొంటూ ఆడియో టేపులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్పై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ ఫిరాంయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లఘించి అశోక్ బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకున్నారని ఆరోపించారు. అలానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఆయన చట్టవ్యతిరేకంగా వ్యవహరించారని ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రస్తుతం రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన, అస్థిరత గురించి ఆ రాష్ట్ర గవర్నర్ పూర్తిగా తెలుసుకోవాలి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి’’ అని ట్విటర్ వేదికగా మాయావతి డిమాండ్ చేశారు.
అశోగ్ గహ్లోత్ నేతృత్వలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ జోషి స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. అంతకు ముందు తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి, భాజపా నేత గజేంద్ర సింగ్ షెకావత్ కుట్ర పన్నారని ఆరోపిస్తూ పలు ఆడియో టేపుల సంభాషణలను కాంగ్రెస్ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో కాంగ్రెస్ తనపై అసత్య ఆరోపణలు చేస్తోందనీ, ఎలాంటి విచారణకైనా సిద్ధమనీ మంత్రి ప్రకటించారు. అలానే రాజస్థాన్ ముఖ్యమంత్రి నివాసం నకిలీ ఆడియోలకు నిలయంగా మారిందని భాజపా ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం