భాజపాలో విలీనమయ్యే ప్రసక్తే లేదు

భారతీయ జనతా పార్టీలో జేడీఎస్‌ను విలీనం చేస్తారని వస్తున్న వార్తలు వదంతులేనని జేడీఎస్‌ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగానీ, ప్రాంతీయ పార్టీలతోగానీ జేడీఎస్‌ విలీనం కాదని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. తమ పార్టీని భాజపాలో విలీనం చేస్తే..

Published : 22 Dec 2020 01:47 IST

బెంగళూరు: భారతీయ జనతా పార్టీలో జేడీఎస్‌ను విలీనం చేస్తారని వస్తున్న వార్తలు వదంతులేనని జేడీఎస్‌ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి స్పష్టం చేశారు. జాతీయ పార్టీలుగానీ, ప్రాంతీయ పార్టీలతోగానీ జేడీఎస్‌ విలీనం కాదని ఆయన మరోసారి తేల్చి చెప్పారు. తమ పార్టీని భాజపాలో విలీనం చేస్తే.. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తారన్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. భాజపా అంతర్గత, రాజకీయ నిర్ణయాల్లో తాను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదన్నారు. ప్రస్తుతం విలీనం లేదా సంకీర్ణం గురించి ఆలోచించడం లేదని తెలిపారు. వచ్చే రెండున్నరేళ్లు కష్టపడి పూర్తి స్థాయి మెజార్టీ తెచ్చుకునేందుకు కృషి చేస్తానని కుమారస్వామి పేర్కొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని