బాధితులకు రూ.10వేలు ఇవ్వాలి:చంద్రబాబు

ఏపీలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల నష్టపరిహారం అందజేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Published : 26 Aug 2020 01:28 IST

హైదరాబాద్‌: ఏపీలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల నష్టపరిహారం అందజేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రెండువారాలు దాటుతున్నా గోదావరి వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జూమ్‌ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా మద్దతుదారులకే అండగా ఉంటామని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంటే తిరుగుబాటు తప్పదన్నారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే గోదావరి పరీవాహక ప్రజలకు ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి సమయానికి కిందికి నీరు వదలడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసరాలతో పాటు హుద్‌హుద్‌, తిత్లీ సమయంలో తాము ఇచ్చిన ప్యాకేజీలు ఇప్పుడు వరద బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. బాధితులకు సాయం చేయకుండా రాజకీయం చేస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని