బాధితులకు రూ.10వేలు ఇవ్వాలి:చంద్రబాబు
ఏపీలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల నష్టపరిహారం అందజేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ఏపీలో వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.10వేల నష్టపరిహారం అందజేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి నిర్మించి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. రెండువారాలు దాటుతున్నా గోదావరి వరద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జూమ్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా మద్దతుదారులకే అండగా ఉంటామని ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంటే తిరుగుబాటు తప్పదన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వల్లే గోదావరి పరీవాహక ప్రజలకు ఈ దుస్థితి తలెత్తిందని చెప్పారు. ప్రాజెక్టుల నుంచి సమయానికి కిందికి నీరు వదలడంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిత్యావసరాలతో పాటు హుద్హుద్, తిత్లీ సమయంలో తాము ఇచ్చిన ప్యాకేజీలు ఇప్పుడు వరద బాధితులకు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితులకు సాయం చేయకుండా రాజకీయం చేస్తే తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434