‘కేంద్రం వాటాపై హరీశ్ చెప్పేవి అబద్ధాలే’
తెలంగాణ భవిష్యత్కు దుబ్బాక ఉప ఎన్నిక నాంది పలుకుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు.
మేం లేకుంటే వెయ్యిమంది కేసీఆర్లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు
దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్రెడ్డి వ్యాఖ్యలు
దుబ్బాక: తెలంగాణ భవిష్యత్కు దుబ్బాక ఉప ఎన్నిక నాంది పలుకుతుందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. తెరాస, కేసీఆర్కు బుద్ధిచెప్పే అవకాశం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రఘునందన్రావుకు మద్దతుగా భూంపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన సభలో కిషన్రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో దుబ్బాక కీలకపాత్ర పోషించిందని చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని ఆరోపించారు.
‘‘తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన నడుస్తోంది. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటాపై మంత్రి హరీశ్రావు చెప్పేవి అబద్ధాలే. పంటల బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో.. ప్రస్తుతం రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందో ప్రజలు ఆలోచించుకోవాలి. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని కేసీఆర్ చెప్పారు. రెండోసారి అధికారంలోకి వచ్చినా దళితులకు మొండిచేయి చూపారు. మూత పడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ఎందుకు తెరిపించలేకపోయారు? రాష్ట్రంలో నిరుద్యోగం విలయతాండవం చేస్తోంది. ఏడు సంవత్సరాలుగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. భాజపా లేకపోతే వెయ్యి మంది కేసీఆర్లు ఉన్నా తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు రాజ్నాథ్సింగ్, సుష్మాస్వరాజ్ తదితరులు పార్లమెంట్లో కాంగ్రెస్ మెడలు వంచడంతో తెలంగాణ సాధించుకున్నాం’’ అని కిషన్రెడ్డి అన్నారు.
పోరాడే తెగింపు రఘునందన్ది..గెలిపించండి
ప్రశ్నించే గొంతు రఘునందన్రావుదని.. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న వ్యక్తి ఆయనని కిషన్రెడ్డి చెప్పారు. రఘునందన్కు డబ్బులేకపోయినా ప్రజల కోసం పోరాడే తెగింపు ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజాసమస్యలపై పోరాటం చేయగల ఆయన్ను ఉప ఎన్నికలో గెలిపించాలని కిషన్రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434