AAP: గుజరాత్పై ‘ఆప్’ గురి.. ఇప్పుడైతే 58 సీట్లొస్తాయంటూ ప్రకటన!
దిల్లీ, పంజాబ్లలో అధికారంలో కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్పై గురిపెట్టింది. శని, ఆదివారాల్లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్,....
అహ్మదాబాద్: దిల్లీ, పంజాబ్లలో అధికారంలో కొనసాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గుజరాత్పై గురిపెట్టింది. శని, ఆదివారాల్లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అక్కడ పర్యటించిన అనంతరం సోమవారం గుజరాత్లోని ఆ పార్టీ ఇన్ఛార్జి, వ్యూహకర్త, రాజ్యసభ సభ్యుడు డా.సందీప్ పాఠక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇప్పటి పరిస్థితుల్లో అయితే తమ పార్టీ దాదాపు 58 స్థానాలు గెలుచుకుంటుందని అంతర్గత సర్వేలో తేలినట్టు చెప్పారు. తమ పార్టీకి చెందిన ఏజెన్సీ ఒకటి శాస్త్రీయ పద్ధతిలో సర్వే చేసినట్టు పేర్కొన్నారు. అంతర్గత సర్వే ప్రకారం.. కాంగ్రెస్పై అసంతృప్తితో ఉన్న గ్రామీణ ఓటర్లు, పట్టణ ప్రాంతాల్లో మార్పు కోరుకుంటున్న మధ్యతరగతి ఓటర్లు ఆప్ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలిపారు.
ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆప్ 58 సీట్లు గెలుచుకుంటుందని పాఠక్ అన్నారు. భాజపాను కాంగ్రెస్ పార్టీ ఓడించలేదనే భావన గ్రామీణ ప్రజల్లో ఉందన్నారు. ఇప్పటికైతే ఇదే పరిస్థితి ఉందనీ.. కాలం గడిచిన కొద్దీ ఈ సీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. భాజపా ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ విభాగం ఇటీవల నిర్వహించిన సర్వేలో కూడా ఆప్కు 55 సీట్లు వస్తాయని తేలినట్టు పాఠక్ వ్యాఖ్యానించారు. సందీప్ పాఠక్ ఇటీవల పంజాబ్లో ఆప్ అపూర్వ విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. 182 స్థానాలు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి ఈ ఏడాది డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం