Gujarat polls: ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ పోటీ ఇక్కడి నుంచే..!
వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat polls) ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ(Isudan Gadhvi) పోటీ చేయబోయే స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
అహ్మదాబాద్: వచ్చే నెలలో జరగబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో(Gujarat polls) ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్ గఢ్వీ(Isudan Gadhvi) పోటీ చేయబోయే స్థానాన్ని ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. గఢ్వీ సొంత జిల్లా దేవ్భూమి ద్వారకాలోని ఖంభాలియా నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఇసుదాన్ గఢ్వీ కొన్నేళ్లుగా రైతులు, నిరుద్యోగ యువత, మహిళలు, వ్యాపారుల తరఫున గళం వినిపిస్తున్నారని తెలిపారు. శ్రీకృష్ణుడి పవిత్రస్థలం నుంచి గుజరాత్కు కొత్త, మంచి ముఖ్యమంత్రి రాబోతున్నారంటూ ట్విటర్లో పేర్కొన్నారు. దీనిపై స్పందిస్తూ గఢ్వీ ట్వీట్ చేశారు. ‘‘మీరు, గుజరాత్ ప్రజలు నాపట్ల ఉంచిన విశ్వాసం మేరకు నా తుదిశ్వాస వరకు గుజరాత్ ప్రజలకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నా. జై జై గర్వి గుజరాత్’’ అని పేర్కొన్నారు.
గుజరాత్ సీఎం అభ్యర్థి కోసం ఆప్ పంజాబ్ తరహాలోనే ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పోల్లో 16 లక్షలపైగా ఓటర్లు పాల్గొన్నారు. ఇందులో దాదాపు 73% మంది గఢ్వీ వైపు మొగ్గు చూపారని ఇటీవల కేజ్రీవాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. సీఎం అభ్యర్థి రేసులో ఇసుదాన్తో పాటు.. పాటీదార్ సామాజిక వర్గానికి చెందిన ఆప్ గుజరాత్ పార్టీ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా ఉండగా.. వెనుకబడిన తరగతి వర్గానికి చెందిన గఢ్వీనే విజయం వరించింది. 40 ఏళ్ల గఢ్వీ.. ద్వారకా జిల్లాలోని పిపలియా గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు స్థానిక టీవీ ఛానల్లో పాత్రికేయుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘ఈటీవీ గుజరాతీ’ ఛానల్లో రిపోర్టర్గా విధులు నిర్వహించారు. తర్వాత వీ ఛానల్కు సంపాదకుడు అయ్యారు. అక్కడ గ్రామీణ, రైతు సమస్యలపై ‘మహామంథన్’ పేరుతో నిర్వహించిన షో... గఢ్వీకి పేరు తెచ్చింది.
గుజరాత్లో మొత్తం 182 సీట్లకు రెండు విడతల్లో (డిసెంబర్ 1, 5తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఆప్ ఇప్పటివరకు 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తొలి విడతలో ఖంభాలియా సహా 88 ఇతర సీట్లకు పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ గడువు సోమవారంతో ముగియనున్న వేళ కేజ్రీవాల్ గఢ్వీ పేరును ఈరోజు సాయంత్రం ప్రకటించారు. గుజరాత్లో రెండో విడత పోలింగ్ డిసెంబర్ 5న జరగనుండగా.. అదేనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం