TMC-Congress: ‘ఎన్నో నెలలు ఎదురుచూశాం కానీ..’: కాంగ్రెస్పై మండిపడిన టీఎంసీ
తాము జాతీయస్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కొనసాగుతామని తృణమూల్ కాంగ్రెస్(TMC) వెల్లడించింది.
కోల్కతా: సీట్ల సర్దుబాటు అంశంలో కాంగ్రెస్(Congress) వ్యవహరించిన తీరును తృణమూల్ కాంగ్రెస్(TMC) నేత అభిషేక్ బెనర్జీ విమర్శించారు. పశ్చిమ్బెంగాల్లో విపక్ష ‘ఇండియా’ కూటమిలో విభేదాలకు ఆ పార్టీనే కారణమని మండిపడ్డారు.
‘కూటమి నిబంధనల ప్రకారం.. మొదట సీట్ల సర్దుబాటుపై ఓ కొలిక్కిరావాలి. ఈ విషయంపై గత ఏడాది జులై నుంచి మేం ఎదురుచూశాం. కానీ కాంగ్రెస్ నుంచి ఏ స్పందనా రాలేదు. కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఎన్నోసార్లు చర్చలు జరిపాం. సీట్ల సర్దుబాటుపై డిసెంబర్ 31 కల్లా ఓ నిర్ణయానికి రావాలని చివరిసారి దిల్లీలో జరిగిన సమావేశంలో తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు. అయినా సరే వారి నుంచి సమాధానం రాలేదు’ అని కాంగ్రెస్ను దుయ్యబట్టారు. అలాగే బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ పార్టీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది’ అని అన్నారు. అయితే జాతీయస్థాయిలో మాత్రం తాము విపక్ష కూటమిలోనే కొనసాగుతామని చెప్పారు.
మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే.. నియంతృత్వ పాలనకు నాంది పలికినట్లే
ఇటీవల బెంగాల్లో కాంగ్రెస్కు టీఎంసీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటుపై తాను చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ తోసిపుచ్చిందని, దీంతో ఒంటరిగా పోటీకి దిగాలని నిర్ణయించినట్లు మమత వెల్లడించారు. కాంగ్రెస్, టీఎంసీల మధ్య పొత్తు విఫలం కావడానికి అధిర్ రంజన్ కారణమని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియెన్ ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. -
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
వైకాపాకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. -
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం
PM Modi: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఎన్నికల తర్వాత విపక్ష కూటమి పేకమేడలా కూలిపోతుందని దుయ్యబట్టారు. -
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
రంజాన్ మాసంలో గాజాపై బాంబింగ్ ఆపాలని తాను ఇజ్రాయెల్ను కోరినట్లు ప్రధాని మోదీ చెప్పారు. -
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
ప్రతి పౌరుడు లబ్ధి పొందేలా తమ ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు ఉంటాయని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. -
గర్భిణిగా ఉన్న నా చెల్లి కడుపుపై తన్నారు: వైకాపా మూక దాడిలో గాయపడిన నూకరత్నం
ఎన్నికల్లో కూటమికి ఓటు వేశామని చెప్పడంతో తమ కుటుంబంపై దాడి చేశారని వైకాపా కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు తెలిపారు. -
మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..
Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే.. తదుపరి ప్లాన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు. -
అధికారులంతా వైకాపాకే కొమ్ముకాశారు: మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
తాజా ఎన్నికల్లో అధికారులెవరూ తమకు సహకరించలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరు తెదేపా అభ్యర్థి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. -
ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు. -
వైకాపాకు 25 స్థానాలైనా దక్కవు: రఘురామకృష్ణరాజు
వైకాపాకు 25 అసెంబ్లీ స్థానాలు కూడా దక్కవని ఎంపీ, ఉండి తెదేపా అభ్యర్థి రఘురామకృష్ణ రాజు అన్నారు. -
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?