Rahul Gandhi: వ్యాపార సంస్థల లబ్ధి కోసమే అగ్నివీర్ పథకం.. కేంద్రంపై రాహుల్ విమర్శలు
రక్షణ రంగ బడ్జెట్ను సైనికుల జీతాలు, ప్రోత్సాహకాల కోసం ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం భావించడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
కైముర్: దేశంలోని పెద్ద వ్యాపార సంస్థలకు లబ్ధి చేకూరేలా రక్షణ రంగ బడ్జెట్ను మోదీ ప్రభుత్వం ఖర్చు చేయాలనుకుంటోందని కాంగ్రెస్ (Congress) అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gadhi) ఆరోపించారు. ఇందుకోసమే కేంద్రం అగ్నివీర్ పథకాన్ని (Agniveer Scheme) ప్రవేశపెట్టిందన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో భాగంగా బిహార్లోని కైముర్ జిల్లాలో మొహనియాలో స్థానిక యువతతో ఆయన ముచ్చటించారు. ఈ ప్రాంతం బిహార్-ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంది. ఇక్కడి యువతలో ఎక్కువమంది కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఎక్కువమంది యువత ఆందోళనకు దిగారు.
ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
‘‘సాధారణ సైనికులకు లభించినట్లు అగ్నివీర్లకు జీతం, పెన్షన్ లభించవు. క్యాంటీన్ వసతి కూడా ఉండదు. రక్షణ బడ్జెట్లో సైనికుల జీతాలు, ప్రోత్సాహకాల కోసం ఖర్చు చేయాలని మోదీ ప్రభుత్వం భావించడం లేదు. ఆ మొత్తాన్ని దేశంలోని బడా వ్యాపార సంస్థల లబ్ధి కోసం ఖర్చు చేయాలనుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చి.. అధికారంలోకి రాగానే 45 ఏళ్లలో రికార్డు స్థాయిలో దేశంలో నిరుద్యోగుల సంఖ్యను పెంచారు ’’ అని రాహుల్ విమర్శించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమైన రాహుల్.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పంటకు కనీస మద్దతు ధర (MSP)కి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం