Ambati: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి తప్పిన ప్రమాదం

ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద తృటిలో ప్రమాదం తప్పింది.

Published : 26 Oct 2023 20:46 IST

సత్తుపల్లి: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకి తృటిలో ప్రమాదం తప్పింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంత్రి అంబటి కాన్వాయ్ అశ్వారావుపేట వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తుండగా.. అదే సమయంలో నాందేడ్‌ నుంచి విశాఖపట్నానికి గోధుమ బస్తాల లోడుతో ఓ లారీ వెళ్తుంది. ఈ క్రమంలో సత్తుపల్లి శివారులోని హోండా షోరూం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనంలోని కర్రలు గోధుమల లోడుకు తగలడంతో తాళ్లు తెగి రెండు గోధుమ బస్తాలు మంత్రి కారు బానెట్‌పై పడ్డాయి. దీంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బ్రేక్‌ వేయడంతో ప్రమాదం తప్పింది. ఘటన తర్వాత మరో కారులో అంబటి ఖమ్మం వైపు వెళ్లిపోయారు. ఘటనపై మంత్రి పీఏ సత్తుపల్లి పోలీసులకు చెప్పడంతో లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు