President Poll: రాజస్థాన్ ఎఫెక్ట్.. అధ్యక్ష రేసునుంచి వైదొలగిన గహ్లోత్
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పోటీపై స్పష్టత వచ్చింది.
దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ పోటీపై స్పష్టత వచ్చింది. తాను పోటీ నుంచి విరమించుకుంటున్నట్టు గురువారం ఆయనే స్వయంగా వెల్లడించారు. పార్టీ అధినేతగా ఎన్నికైనా, ఆయన ముఖ్యమంత్రి పదవిని వీడాలనుకోకపోవడంతో రాజస్థాన్లో రాజకీయంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అనంతరం.. ఆయన రేసు నుంచి బయటకు వచ్చారు.అలాగే ఎమ్మెల్యే తిరుగుబాటు నేపథ్యంలో సోనియాకు క్షమాపణలు తెలియజేశారు.
బుధవారం రాత్రి దిల్లీకి వచ్చిన గహ్లోత్ ఈ రోజు మధ్యాహ్నం సోనియాతో భేటీ అయ్యారు. గంటన్నరపాటు వీరి సమావేశం సాగింది. అనంతరం బయటకు వచ్చిన ఆయన అధ్యక్ష ఎన్నికలో పోటీచేయడం లేదని చెప్పారు. అయితే అంతిమ నిర్ణయం పార్టీదేన్నారు. ‘ఈ రోజు నేను సోనియాగాంధీతో మాట్లాడాను. రెండురోజుల క్రితం జరిగిన పరిణామాలతో మేం షాక్కు గురయ్యాం. నేను ముఖ్యమంత్రిగా ఉండాలనుకున్నందుకే ఇదంతా జరిగిందనే అంతా భావించారు. ఈ పరిణామాలపై నేను సోనియాకు క్షమాపణలు తెలియజేశాను.
నేను కొచ్చిలో రాహుల్ గాంధీని కలిశాను. అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలని కోరాను. ఆయన అంగీకరించకపోవడంతో.. నేను పోటీ చేస్తానని చెప్పాను. ఈ సమయంలో రాజస్థాన్లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఒకే వాక్య తీర్మానం అనేది పార్టీ సంప్రదాయం. దురదృష్టవశాత్తూ తీర్మానం ఆమోదించలేని పరిస్థితి ఎదురైంది. ఆ పరిస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ.. పోటీ నుంచి వైదొలుగుతున్నాను’అని వెల్లడించారు. అలాగే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారా..? అని అడిగి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘అది నేను నిర్ణయించలేను. దానిపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారు’అని తెలిపారు.
దిగ్విజయ్ పోటీ ఖరారు..
ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నిక బరిలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ ఖరారైంది. గురువారం ఆయన నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ‘నేను నామినేషన్ పత్రాలు తీసుకున్నాను. వాటిని శుక్రవారం సమర్పిస్తాను’ అని మీడియాకు వెల్లడించారు. ఆయన పది సెట్ల పత్రాలను తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఎంపీ శశిథరూర్ కూడా పోటీలో ఉన్నారు. నామినేషన్ల సమర్పణకు శుక్రవారం ఆఖరి రోజు కావడంతో రేపు వారిద్దరు పత్రాలు సమర్పించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం