రైతుల కంట కన్నీరు.. ఫామ్హౌస్ పంట పన్నీరులా కేసీఆర్ పాలన: బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 8ఏళ్ల పాలనంతా రైతుల కంట కన్నీరు కేసీఆర్ ఫామ్హౌస్ పంట పన్నీరుగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 8 ఏళ్ల పాలనంతా రైతుల కంట కన్నీరు.. ఆయన ఫామ్హౌస్ పంట పన్నీరుగా మారిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు సీఎంకు ఆయన 3 పేజీల బహింరంగ లేఖ రాశారు. కేంద్రం, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తెరాస అసత్య ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలన్నారు. వరి సహా 14 పంటలకు కనీస మద్దతు ధరను పెంచినందుకు ఈ సందర్భంగా ప్రధానికి బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.
‘‘రైతుబంధు నిధులు రూ.7500 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలి. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి. సీఎం కేసీఆర్ వ్యక్తిగత ప్రచారానికి, మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. మరి రైతుబంధుకు, రైతు రుణమాఫీకి సకాలంలో నిధులు కేటాయించకపోవడం బాధాకరం. రైతుబంధు నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రైతులు రుణాలు తీసుకుంటూ అప్పుల పాలవుతున్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇప్పటివరకు తెలంగాణలో రూ.5800 కోట్ల నిధులను జమచేసి రైతులను ఆదుకుంది. ఈ పథకంలో భాగంగా ఈ సీజన్ కోసం రూ.580 కోట్లను మే 31న కేంద్రం విడుదల చేసింది. ఫసల్ బీమా యోజన పథకం ద్వారా నష్టపోయిన రైతులకు చేయూతనిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు రైతులకు అందేలా చేయాలి. అందుకు తెలంగాణ ప్రభుత్వం బకాయిపడ్డ తమ వాటా నిధులను వెంటనే విడుదల చేయాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!