Bandi Sanjay: కాంగ్రెస్ అభ్యర్థులకు రూ.వేల కోట్లు పాకెట్‌ మనీ ఇస్తున్నారు: బండి సంజయ్‌

కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన వాళ్లు ఎలాగూ భారాసలోకి వస్తారని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Updated : 25 Jun 2023 16:37 IST

హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్‌ అనుకుంటే సరిపోదని, రాష్ట్ర ప్రజలూ అనుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. డిపాజిట్లు ఏ పార్టీ కోల్పోతుందో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా గెలిచిందని ఆయన గుర్తు చేశారు.  ఈ విషయాన్ని మరిచిపోయి కాంగ్రెస్‌ నేతలు అద్దాల మేడలో ఉంటూ సంతోష పడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు నోవాటెల్ హోటల్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలనను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం గమనిస్తోందని బండి సంజయ్‌ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో భాజపా గెలవొద్దని కేసీఆర్ గట్టిగా కోరుకుంటున్నారన్నారు. కాంగ్రెస్‌లో గెలిచిన వాళ్లు ఎలాగూ భారాసలోకి వస్తారని భావిస్తున్నారని చెప్పారు. అందుకే కేసీఆర్ కాంగ్రెస్‌ను పైకి లేపుతున్నారన్నారు. భారాస బలహీనంగా ఉన్న చోట 30మంది కాంగ్రెస్ అభ్యర్థులకు రూ.వేల కోట్లు పాకెట్‌ మనీ ఇచ్చి కేసీఆర్ పెంచి పోషిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని