Kishareddy: కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో.. భాజపా బైక్‌ ర్యాలీ

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. 

Updated : 15 Sep 2023 10:46 IST

హైదరాబాద్‌: సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, అమరుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, స్మృతి స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా ఇవాళ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలోని పోలీసు అమరవీరుల స్మృతి స్థలి నుంచి హనుమకొండ జిల్లా పరకాలలోని అమరధామం వరకు ర్యాలీ కొనసాగుతుంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ద్విచక్ర వాహన ర్యాలీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ర్యాలీ ముగిసిన అనంతరం పరకాల అమరధామం వద్ద భారీ బహిరంగ సభ జరగనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని