Ponguleti: ఖమ్మం జిల్లాకు భాజపా ముఖ్యనేతలు.. పొంగులేటి నిర్ణయంపై ఉత్కంఠ
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఈటల రాజేందర్ నేతృత్వంలోని భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. పొంగులేటిని కమలం గూటికి తీసుకొచ్చేందుకు ఆపార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఖమ్మం: రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కమలం గూటికి రప్పించేందుకు ముమ్మరంగా యత్నిస్తోంది. ఈమేరకు భాజపా చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ముఖ్యనేతల బృందం గురువారం ఖమ్మం వచ్చి పొంగులేటితో భేటీ అయింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, ఏలేటి మహేశ్వర్రెడ్డి ఖమ్మంలో మాజీ ఎంపీ పొంగులేటితో గురువారం భేటీ అయ్యారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన జూపల్లి కృష్ణారావుకూడా పొంగులేటితో పాటు చర్చల్లో పాల్గొన్నారు.
వాస్తవానికి భారాస నుంచి బహిష్కరణకు గురైన తర్వాత భాజపాలోకి రావాలని ఈటల రాజేందర్ పలుమార్లు పొంగులేటిని ఆహ్వానించినట్లు గతంలోనే ప్రచారం సాగింది. రెండు జాతీయ పార్టీల ముఖ్యనేతలు తనను సంప్రదిస్తున్నారంటూ మాజీ ఎంపీ పలుమార్లు వ్యాఖ్యానించారు. భారాసను మూడోసారి అధికారంలోకి రానివ్వకుండా.. కేసీఆర్ను సీఎం కాకుండా చేసే పార్టీలోకే వెళతానని ప్రకటించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు సంబంధించి భారాస అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వబోనని శపథం చేశారు. మరికొద్దిరోజుల్లోనే ఖమ్మం నగరంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి సన్నద్ధమవుతున్నారు. ఈలోగా భాజపా ముఖ్యనేతలు పొంగులేటితో భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇవాళ మధ్యాహ్నం నుంచి పొంగులేటి నివాసంలో భాజపా నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. భాజపాలో పొంగులేటికి ఇచ్చే ప్రాధాన్యతపై ఈటల స్పష్టంగా వివరించినట్టు సమాచారం. ఈటల నేతృత్వంలోని భాజపా ముఖ్యనేతలతో పాటు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు మాత్రమే చర్చల్లో పాల్గొన్నారు. గంటసేపటి తర్వాత పొంగులేటి గతంలోనే ప్రకటించిన ఇల్లందు అభ్యర్థి కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా అభ్యర్థిగా ప్రకటించిన విజయాభాయిని చర్చల్లోకి పిలిచారు. సెల్ఫోన్లను కూడా అనుమతించకుండా దాదాపు రెండున్నర గంటలకు పైగా చర్చిస్తున్నారు. ఈటల రాజేందర్ ఇచ్చిన హామీలపై పొంగులేటి స్పందన మాత్రం ఇంకా రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం