Kejriwal: ఆప్ని చూసి భయపడే.. ‘ఫ్రీ..ఫ్రీ’ అంటున్నారు!
ఆమ్ ఆద్మీ పార్టీని చూసి భాజపాకు భయం పట్టుకుందనీ.. అందుకే ఇటీవల హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అక్కడి ప్రజలకు ఉచితాలు.....
ధర్మశాల: ఆమ్ ఆద్మీ పార్టీని చూసి భాజపాకు భయం పట్టుకుందనీ.. అందుకే ఇటీవల హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ అక్కడి ప్రజలకు ఉచితాలు ప్రకటించారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ధర్మశాల సమీపంలోని చంబిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భాజపాపై మండిపడ్డారు. సీఎం ఠాకూర్ 125 యూనిట్ల వరకు ప్రజలు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ సీఎం ఠాకూర్కు అలాంటి ఆఫర్లు ఇవ్వొద్దంటూ చీవాట్లు పెట్టారన్నారు. ప్రజలకు నిజంగా ఉపశమనం కల్పించాలని భాజపా సీరియస్గా అనుకుంటే ఆ పార్టీ పాలిత రాష్ట్రాలైన హరియాణా, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి చోట్ల కూడా ఇలాంటివి ప్రకటించవచ్చు కదా అన్నారు.
డిసెంబర్లో ఎన్నికలు జరగనున్న వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జైంరా ఠాకూర్ ఇటీవల మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో 50శాతం ఛార్జీల్లో రాయితీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నీటి బిల్లులు రద్దు.. 125 యూనిట్ల వరకు అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం హిమాచల్ప్రదేశ్లో పర్యటించిన కేజ్రీవాల్ అక్కడ పాఠశాలల పరిస్థితిపై ధ్వజమెత్తారు. ‘‘ఒక్కసారి మీ సీఎంతో కలిసి దిల్లీకి వచ్చి చూడండి. గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు 99.7శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. ఈ అభివృద్ధి చూసి ఈ ఏడాది ఏకంగా 4లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారు. గత ఏడేళ్లుగా అధిక ఫీజులు వసూలు చేయకుండా ప్రయివేటు స్కూళ్లను నియంత్రిస్తున్నాం. దిల్లీలో మా ప్రభుత్వం ఆస్పత్రులు, ఉచిత వైద్య సదపాయాల్ని అందరికీ కల్పిస్తోంది. హిమాచల్ ప్రదేశ్లో కూడా అలాంటి వసతులు కల్పించే నిజాయతీ కలిగిన ప్రభుత్వం రావాలనుకుంటే ఆప్కు ఓటేయండి. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ 30 ఏళ్లు పాలించింది.. భాజపా 17 ఏళ్లుగా పాలిస్తోంది. మాకు ఒక్క ఐదేళ్లు ఇవ్వండి. ఆ తర్వాత మళ్లీ మేం ఓట్లు అడగం. మా అభివృద్ధి చూసే జనమే ఓటు వేస్తారు’’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం