Telangana : కొత్త రాజ్యాంగం ఎందుకు రాయాలో తెరాస నేతలు చెప్పాలి: భాజపా
తెరాస నాయకులు దిక్కుతోచని స్థితిలో తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర
హైదరాబాద్: తెరాస నాయకులు దిక్కుతోచని స్థితిలో తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర కార్యాలయంలో గుజ్జుల మాట్లాడుతూ.. కొత్త రాజ్యాంగం ఎందుకు రాయాలో తెరాస చెప్పాలన్నారు. కేంద్రం నుంచి నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్తున్నాయనే బాధతోనేననా? అని ప్రశ్నించారు. తెరాస అవినీతి బయటపడి, అరెస్ట్ అవుతామనే భయంతోనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఎంతటి త్యాగానికైనా భాజపా సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబమే ఎల్లకాలం అధికారంలో ఉండాలని రాజ్యాంగం రాస్తారా? దేశంలో సమానత్వం తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుందన్నారు.
ఎయిర్ ఇండియాను కేంద్రం అమ్మేసిందని ఆరోపణలు చేస్తున్నారని, మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రభుత్వ భూములను ఎందుకు అమ్మారో తెరాస నేతలు చెప్పాలని ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు భాజపా ఆందోళనలు కొనసాగిస్తుందని తెలిపారు. తెరాస నేతలే కేసీఆర్పై వ్యతిరేకతతో ఉన్నారని, వారి పార్టీలోనూ చర్చ జరుగుతుందన్నారు. తెరాస, భాజపా ఒక్కటేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. భాజపా నేతలపై అరెస్టులు, దాడులు కాంగ్రెస్కు కనిపించడం లేదా? ప్రేమేందర్ రెడ్డి అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్