Andhra News: అక్రమార్కులను ప్రోత్సహించేలా ప్రతిపక్ష నేతల వైఖరి: మంత్రి బొత్స
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్, పేపర్..
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలపై విపక్షాలది అనవసర రాద్ధాంతమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్, పేపర్ లీక్ అనేది జరగలేదని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ప్రశ్న పత్రాల విషయంలో ఇప్పటివరకు 60 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 38 మంది ప్రభుత్వ, 22 మంది ప్రైవేటు సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా క్రిమినల్ కేసులు పెట్టినట్లు చెప్పారు. ఈ అంశంలో ప్రైవేటు విద్యాసంస్థల సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. అక్రమార్కులను ప్రోత్సహించేలా ప్రతిపక్ష నేతల వైఖరి ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తే ఉపాధ్యాయ సంఘాలు ఊరుకుంటాయా?అని ప్రశ్నించారు. విద్య, వైద్యం.. ఈ రెండింటికి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని.. తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు