YSRCP: మంత్రి అంబటికి సత్తెనపల్లి టికెట్‌ ఇస్తే ఓడిస్తాం: అసమ్మతి నేతలు

మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైకాపా అసమ్మతి నేతలు స్పష్టం చేశారు.

Published : 13 Mar 2024 16:44 IST

తాడేపల్లి: మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్‌ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని వైకాపా అసమ్మతి నేతలు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వైకాపా నేతల పంచాయితీ తాడేపల్లికి చేరింది. అంబటికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలంతా ఏకమయ్యారు. 

ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ ఇవ్వొద్దని కొంతకాలంగా స్థానిక నేతలు నిరసన తెలుపుతున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతో సత్తెనపల్లి ఇన్‌ఛార్జి మార్పు యోచనలో అధిష్ఠానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబటి రాంబాబుకు పిలుపు వచ్చింది. నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్‌ కుమార్ యాదవ్‌తో ఈ అంశంపై సీఎం జగన్‌ చర్చించినట్టు సమాచారం. నేతలతో చర్చించిన అనంతరం సత్తెనపల్లి టికెట్‌ అంబటికి ఇవ్వాలా? వద్దా? అనేది జగన్ నిర్ణయిస్తారని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని