Telangana News: తెరాస పేరు బీఆర్ఎస్ కంటే వీఆర్ఎస్గా మారిస్తే బాగుంటుంది: జైరామ్ రమేశ్
మన దేశానికి భాజపా, ఆర్ఎస్ఎస్తో పాటు తెరాసతోనూ ప్రమాదముందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో తెరాస పేరు బీఆర్ఎస్ కంటే వీఆర్ఎస్గా మారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: మన దేశానికి భాజపా, ఆర్ఎస్ఎస్తో పాటు తెరాసతోనూ ప్రమాదముందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ విమర్శించారు. జాతీయ స్థాయిలో తెరాస పేరు బీఆర్ఎస్ కంటే వీఆర్ఎస్గా మారిస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో భారత జోడో యాత్రపై నిర్వహించిన సమీక్షలో ఆయన పాల్గొన్నారు. భేటీలో సీనియర్ నేతలు దిగ్విజయ్సింగ్, కొప్పుల రాజు, మాణికం ఠాగూర్, ఉత్తమ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీనేత భట్టి విక్రమార్క పలువురు నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో భారత జోడో యాత్ర 13 రోజుల కార్యక్రమంగా చూడకూడదని, తెలంగాణ కాంగ్రెస్ భారత జోడో యాత్ర ఉద్దేశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తుందని జైరామ్ రమేశ్ వివరించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎలాంటి మార్పు తీసుకు రాలేవన్న దిగ్విజయ్సింగ్.. పేరు మారిస్తే ఎలాంటి ఫలితం ఉండబోదని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434