Telangana News: ఆ పని చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతా: జగ్గారెడ్డి
నగరంలోని అశోక హోటల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ముగిసింది. సమావేశం వద్దకు మానవతారాయ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ వెళ్లారు. కాగా ముగ్గురిని జగ్గారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాలని
హైదరాబాద్: తమకు పార్టీ షోకాజ్ నోటీస్ ఇస్తే సమాధానం చెబుతామని.. సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తనను సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతానని హెచ్చరించారు. అశోక హోటల్లో కాంగ్రెస్ సీనియర్ నేతల ‘ప్రత్యేక’ భేటీ ముగిసిన అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘సస్పెండ్ చేసినా అధిష్ఠానానికి విధేయుడిగా ఉంటా. రేవంత్ నా సవాలు స్వీకరిస్తే నేను రాజీనామా చేస్తా. నా స్థానంలో అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటే రేవంత్ హీరో అని ఒప్పుకుంటా. నేను గెలిస్తే నేను హీరో, ఇద్దరం ఓడితే ఇద్దరం జీరోలమే. పార్టీ సిద్ధాంతంలో రేవంత్ పని చేయడం లేదు. వీహెచ్ తన కూతురు సమస్యపై హరీశ్రావును కలిస్తే తప్పేంటి?’’ అని జగ్గారెడ్డి నిలదీశారు. అంతకుముందు సమావేశం వద్దకు కాంగ్రెస్ నేతలు మానవతారాయ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్ వెళ్లగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని జగ్గారెడ్డి వారికి సూచించారు. దీంతో ఆ ముగ్గురూ వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు