ఆర్జీవీకి దమ్ముంటే తెదేపా నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలి: దేవినేని సవాల్‌

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ షూటింగ్‌ తీయడంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Updated : 13 Aug 2023 15:24 IST

విజయవాడ: ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ షూటింగ్‌ తీయడంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర సంగమం వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘పట్టిసీమ పథకం దండగని ప్రచారం చేసిన వైకాపా నాయకులు ఇవాళ ఏ మొహం పెట్టుకొని సినిమా షూటింగ్‌లు చేయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే పట్టిసీమ పూర్తి చేసి 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ఘనత తెదేపాది. మళ్లీ మేం అధికారంలోకి రాగానే వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులను తిరిగి నిర్మిస్తాం. ప్రాజెక్టులపై తెదేపా అధినేత చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లను ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తిలకించారు. ఆర్జీవీకి దమ్ముంటే తెదేపా నిర్మించిన ప్రాజెక్టులపై సినిమా తీయాలి’’ అని దేవినేని ఉమ సవాల్‌ విసిరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని