Andhra News: సీఎం జగన్.. అవగాహన లేని మంత్రులతో జాతికి ద్రోహం చేయొద్దు: దేవినేని
రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్లో కాంట్రాక్టర్ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు.
అమరావతి: రివర్స్ టెండరింగ్ పేరుతో నాటకాలాడి వరదలొచ్చే సమయానికి పోలవరం డ్యాం సైట్లో కాంట్రాక్టర్ లేకుండా చేశారని ఏపీ సీఎం జగన్పై తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. సీఎం జగన్ అసమర్థతకు తెలుగుజాతి మూల్యం చెల్లించుకుంటోందని ఆక్షేపించారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు.
‘‘నాడు ప్రతి సోమవారం పోలవరంపై చంద్రబాబు సమీక్షించారు.తెదేపా నేత చంద్రబాబు దాదాపు 35 సార్లు పోలవరం వెళ్లి పనులు పరిగెత్తించారు. 16 జాతీయ ప్రాజెక్టుల్లో ఏ పనులూ పోలవరమంత వేగంగా జరగలేదు. నాటి కేంద్ర మంత్రి గడ్కరీ రెండు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ప్రతి వారం ప్రాజెక్టు పనుల సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహార శైలితో ప్రాజెక్టు నిర్మాణంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి కోసం చేసిన నిర్వాకం వల్లే డయాఫ్రమ్ వాల్ వద్ద నష్టం జరిగింది. అయితే డయాఫ్రమ్ వాల్కు ఎప్పుడు నష్టం జరిగిందనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియకుండా పోయింది. ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి, జరిగిన నష్టంపై ప్రజలకు సమాధానం చెప్పాలి. బాధ్యతాయుతమైన జలవనరుల శాఖపై ఏదేదో మాట్లాడుతున్న మంత్రి అంబటి రాంబాబుని ఎవరికైనా చూపించండి. అవగాహన లేని మంత్రులతో జాతికి, రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయొద్దు’’ అని దేవినేని హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434