Dhulipalla: అధికార పార్టీకి ఒక రూల్‌, ప్రతిపక్షానికి ఒక రూలా?: ధూళిపాళ్ల నరేంద్ర ఫైర్‌

ఓటమి భయంతో పంచాయతీ ఉప ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకల దాడి దుర్మార్గమన్నారు.

Updated : 19 Aug 2023 12:39 IST

దెందులూరు: ఓటమి భయంతో పంచాయతీ ఉప ఎన్నికల్లో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గం వీరమ్మకుంటలో తెదేపా కార్యకర్తలపై వైకాపా మూకల దాడి దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అండ చూసుకునే వైకాపా కార్యకర్తలు దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. అధికార పార్టీ అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీకి ఒక రూల్‌, ప్రతిపక్షానికి ఒక రూల్‌ పెట్టారా?అంటూ మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దెందులూరు నుంచి పారిపోవడం ఖాయమని అన్నారు. వీరమ్మకుంటలో చోటు చేసుకున్న ఘటనపై ఎన్నికల అధికారులు స్పందించాలని, దాడులకు తెగబడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

Warangal: బిడ్డకు పాలిచ్చి.. అంతలోనే కార్డియాక్‌ అరెస్టుతో బాలింత మృతి!

కాగా, ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం వీరమ్మకుంట పంచాయతీ ఎన్నికల్లో ఉద్రికత్త నెలకొంది. వైకాపా కార్యకర్తలు.. తెదేపా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. వైకాపా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి దగ్గరుండి మరీ తమపై దాడులు చేయిస్తున్నారని తెలుగు దేశం కార్యకర్తలు ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని