ఉచిత వాషింగ్మెషిన్.. ఉచిత కేబుల్ టీవీ!
తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 164 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం దీన్ని విడుదల చేశారు. ఇందులో.
అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 164 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆదివారం దీన్ని విడుదల చేశారు. ఇందులో ఎప్పటిలానే ఉచితాలకు పెద్దపీట వేశారు. ఉచిత వాషింగ్ మెషిన్లు, కేబుల్ టీవీ వంటివి ఇందులో ఉన్నాయి.
తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఉచిత వాషింగ్మెషిన్లు, ఉచిత సోలార్ స్టవ్లు, అందరికీ ఉచిత కేబుల్ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. రేషన్ సరకులను ఇంటికే అందించే ఏర్పాటు చేస్తామని, ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని పేర్కొంది. అమ్మ హౌసింగ్ పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని పేర్కొంది. ఏటా పొంగల్కు ఇచ్చే రూ.2,500 నగదు పథకం కొనసాగుతుందని స్పష్టంచేసింది.
మహిళలకు సిటీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తామని అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని, ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని పేర్కొంది. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.25వేలు సబ్సిడీ, కాలేజీ విద్యార్థులకు ఉచిత 2జీబీ డేటా అందిస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది. శ్రీలంక తమిళ శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు వంటివీ ఇందులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434