తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలివే!

గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి...

Updated : 10 Feb 2020 15:33 IST

ఎంపీ కోమటిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖిత పూర్వక సమాధానం

దిల్లీ: గడిచిన ఆరేళ్లలో తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2014-15లో తెలంగాణ మిగులు రెవెన్యూ ఉన్న రాష్ట్రమని.. ఆ తర్వాత క్రమంగా అప్పులు పెరిగాయని అందులో పేర్కొన్నారు. తెలంగాణకు ఆరేళ్లలో పన్నుల వాటా కింద రూ.85,013 కోట్లు, రాష్ట్రాల విపత్తు నిధి కింద రూ.1289.04 కోట్లు, స్థానిక సంస్థల నిధుల కింద రూ.6,511 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక సాయం కింద రూ.1,916కోట్లు, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి రూ.3,853కోట్లు విడుదల చేసినట్లు నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.51,298.84 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి రూ.1500.54 కోట్లు తెలంగాణకు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని