భాజపా దిల్లీకి కొత్త చీఫ్
భారతీయ జనతా పార్టీ (భాజపా) దిల్లీ యూనిట్ చీఫ్గా అదేశ్కుమార్ గుప్తాను ఆ పార్టీ నియమించింది. ఇప్పటి వరకు చీఫ్గా ఉన్న మనోజ్ తివారీ స్థానంలో ఆయనను.............
దిల్లీ: భారతీయ జనతా పార్టీ (భాజపా) దిల్లీ యూనిట్ చీఫ్గా అదేశ్కుమార్ గుప్తాను ఆ పార్టీ నియమించింది. ఇప్పటి వరకు చీఫ్గా ఉన్న మనోజ్ తివారీ స్థానంలో ఆయనను నియమిస్తూ మంగళవారం ఓ ప్రకటన వెలువరించింది. గుప్తా గతంలో ఉత్తర దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. మొన్నటి దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మనోజ్ తివారీ తన రాజీనామాను సమర్పించినప్పటికీ.. ఇప్పటి వరకు ఆయననే ఆ పార్టీ కొనసాగించింది.
మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడిగా కేంద్ర మాజీ మంత్రి, గిరిజన నాయకుడు విష్ణు డియో సాయిని నియమించారు. మోదీ తొలి ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 2019లో లోక్సభ ఎన్నికల్లో మాత్రం పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేయలేదు. ప్రస్తుతం విక్రమ్ ఉసెండి ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉన్నారు. మణిపూర్ రాష్ట్రానికి కూడా కొత్త అధ్యక్షుడిగా ఎస్ టికేంద్ర సింగ్ను ఆ పార్టీ నియమించింది. కరోనా వైరస్ వెలుగుచూసిన తర్వాత జరిగిన తొలి పార్టీ సంస్థాగత నియామకాలు ఇవే కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?