ఎక్కువ అప్పు చేశామన్నది వాస్తవమే: బుగ్గన
తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వారానికోసారి ఆర్థికాంశాలపై ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు
అమరావతి: తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వారానికోసారి ఆర్థికాంశాలపై ఏదేదో మాట్లాడుతున్నారని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. రాష్ట్రంలో వృద్ధిరేటు ఎక్కడ తగ్గిందో యనమల చెప్పగలరా?అని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎక్కడా వెనుకబడిన దాఖలాలు లేవన్నారు.దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ నమోదైట్లు చెప్పారు. ‘‘ వాస్తవాలు లేకుండా యనమల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలోని రూ.15వేల కోట్ల బకాయిల చెల్లింపు వల్ల రెవెన్యూలోటు పెరిగింది. బహిరంగ మార్కెట్లో ఎక్కువ అప్పు చేశామనేది వాస్తవమే. కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిపి వస్తున్న ఆదాయం రూ.లక్షా 14వేల కోట్లు. గత ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన అప్పులభారం మోపింది. ఈసారి బడ్జెట్లో అన్ని శాఖలకూ కేటాయింపులు పెరిగాయి. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.42,603 కోట్లు ఇచ్చాం. రెవెన్యూలోటు, పోలవరానికి, జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని, రామాయపట్నం, కడప ఉక్కుపరిశ్రమకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరాం’’అని మంత్రి బుగ్గన అన్నారు. విదేశీ ఆర్థిక సంస్థ రుణం, గ్రాంట్ ఇచ్చేందుకు ఒప్పుకుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు తీన్మార్ మల్లన్న నామినేషన్
తన గెలుపు కోసం యువజన కాంగ్రెస్ సంపూర్ణ సహకారం అందించాలని ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కోరారు. -
నేడు మండలి ‘పట్టభద్రుల’ నోటిఫికేషన్
తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేయనుంది.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్