ప్రతి కార్యకర్త కష్టాన్నీ గుర్తిస్తాం
అనకాపల్లిని పరిశ్రమల హబ్గా మారుస్తా..
వైకాపా ప్లీనరీలో మంత్రి అమర్నాథ్
మాట్లాడుతున్న మంత్రి అమర్, వేదికపై ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే ధర్మశ్రీ, దాడి తదితరులు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే : తాను వైకాపా కార్యకర్తనని చెప్పుకోడానికే ఎక్కువ గర్వపడతానని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మంగళవారం అనకాపల్లిలో నియోజకవర్గ వైకాపా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. తనను ఈ స్థాయిలో నిల్చోబెట్టి వైకాపా విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్త కష్టాన్నీ గుర్తుంచుకుంటానని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అనకాపల్లి జిల్లాకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. కోడూరులో ఆటోనగర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి పరిశ్రమల హబ్గా అనకాపల్లి జిల్లాను మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడతామని పేర్కొన్నారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 95 శాతం నెరవేర్చారని చెప్పారు. గడగడపకు వెళ్లి ఓటడిగే హక్కు వైకాపా కార్యకర్తకే ఉందని పేర్కొన్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విశాఖలో మూడు పారిశ్రామిక సదస్సులు ఏర్పాటుచేసినా ఒక్క పరిశ్రమనైనా తేగలిగారా అని ప్రశ్నించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్పై నోరు పారేసుకుంటున్నారని, ఇక నుంచి ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి మాట్లాడుతూ దేశంలోని ఏ ముఖ్యమంత్రి అమలు చేయలేనన్ని సంక్షేమ పథకాలను జగన్ అమలుచేసి చూపుతున్నారన్నారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ వాలంటీర్లను వైకాపా కార్యకర్తలే నియమించారన్నారు. వాలంటీర్లు పార్టీకి నష్టం కలిగేలా వ్యవహరిస్తే వారిని తొలగిస్తామని చెప్పారు. సీఎం జగన్ అనకాపల్లి జిల్లాకు గుర్తింపు ఇచ్చి రెండు మంత్రి పదవులు కేటాయించారన్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమలు అధికంగా వస్తాయని, స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సీఎం జగన్ స్వతహాగా ఎదిగిన నాయకుడన్నారు. ఎన్టీఆర్, జగన్మోహన్రెడ్డి మాత్రమే కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఎదిరించి రాష్ట్రంలో విజయబావుటా ఎగురవేశారని గుర్తుచేశారు. చంద్రబాబును ఎవరో ఓడించాల్సిన అవసరం లేదని, ఆయన కుమారుడే అందుకు చాలని పేర్కొన్నారు. అనకాపల్లి ప్రతిష్ఠ ఇనుమడింపజేసేలా మంత్రి అమర్నాథ్ పాలన చేయాలని సూచించారు. సమావేశానికి పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అధ్యక్షత వహించగా పార్టీ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, సతీష్ వర్మ, ముక్కా మహాలక్ష్మినాయుడు, రాజారాం, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ భీశెట్టి వరహా సత్యవతి, జీవీఎంసీ కార్పొరేటర్లు మందపాటి సునీత, జాజుల ప్రసన్నలక్ష్మి, కొణతాల నీలిమ, పీలా లక్ష్మీ సౌజన్య, ఎంపీపీలు గొర్లి సూరిబాబు, కలగా లక్ష్మి, వైకాపా నాయకులు దంతులూరి దిలీప్కుమార్, దాడి జయవీర్, జాజుల రమేష్, పలకా రవి, కొణతాల మురళీకృష్ణ, ఆళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: బతుకమ్మ కానుకగా కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్: మంత్రి హరీశ్రావు
-
India News
‘ఆ రెండూ ఉచితాలు కావు.. ఇంతకుమించి మాట్లాడను’: స్టాలిన్
-
Sports News
Virat Kohli : విరాట్లా సుదీర్ఘ ఫామ్లేమి.. వారికి ఎందుకు ఉండదంటే..?
-
World News
Taliban: కాబుల్లో మహిళల నిరసన.. హింసాత్మకంగా అణచివేసిన తాలిబన్లు!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Congress: మూడు దశాబ్దాలు కాంగ్రెస్కు హోంగార్డును.. ట్విటర్ ప్రొఫైల్ను మార్చేసిన ఎంపీ కోమటిరెడ్డి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Naga Chaitanya: సినిమా మధ్యలోనే ప్రేక్షకులు బయటకు వచ్చేశారు.. బాధేసింది: నాగచైతన్య
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్కు స్పందించడం లేదు: రిషి సునాక్
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్లో మూడు సంచలన క్యాచ్లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు