Byreddy Rajasekhar Reddy: రాయలసీమకు నమ్మక ద్రోహం: బైరెడ్డి రాజశేఖర్రెడ్డి
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తోందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్ రాలేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం రాయలసీమ వాసులకు నమ్మక ద్రోహం చేస్తోందని, కర్నూలుకు ఇంతవరకు హైకోర్టు రాలేదని, బెంచ్ రాలేదని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖర్రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తొలుత కర్నూలులోనే ఉన్న రాజధానిని తర్వాత హైదరాబాద్కు తరలించి, స్వార్థ రాజకీయ నాయకులు సీమకు తీరని ద్రోహం చేశారు. తుంగభద్ర జలాల్లో వాటా రాబట్టడంలో పాలకులు విఫలమవుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో వలసలను అరికట్టలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ప్రజలు చైతన్యవంతులయ్యారు. ప్రభుత్వంపై తిరగబడే సమయం వచ్చింది’ అని పేర్కొన్నారు. ఈ నెల 28న చలో సిద్ధేశ్వరం కార్యక్రమం చేపడతామని, తీగల వంతెనకు బదులుగా రోడ్ కమ్ బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని డిమాండు చేశారు. కృష్ణా బోర్డును విశాఖలో పెట్టాలని నిర్ణయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను చనిపోయిన తర్వాత తన అస్థికలను రాయలసీమ నదుల్లో కలపాలని నిర్ణయించానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు