అధికారులను భయపెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
వెంకటగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అధికారులను భయపెట్టి కొంతమంది అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్పై నన్ను అడిగేవాళ్లెవరూ లేరు: ఆనం
నెల్లూరు (నగరపాలక సంస్థ), న్యూస్టుడే: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అధికారులను భయపెట్టి కొంతమంది అభివృద్ధి పనుల్ని అడ్డుకుంటున్నారని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు. రాపూరు ఎంపీపీ బాలకృష్ణారెడ్డి సారథ్యంలో పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గురువారం ఆయనతో సమావేశమయ్యారు. అనంతరం రామనారాయణరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మండల పరిషత్, జడ్పీటీసీ సభ్యులు ఏగ్రీవమైన మండలం రాపూరు అని, అలాంటి మండలంలోనూ రాజకీయ అనిశ్చితి నెలకొందని అన్నారు. తాము వైకాపాలో ఉన్నామా.. తీసేశారా.. తమ అధికారం ఏమిటని అడిగేందుకు వీరంతా వచ్చారని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను తీసేసే అధికారం ఎవరికీ లేదని, పదవులకు ఎలాంటి ఢోకా ఉండదని తాను చెప్పానన్నారు. ప్రస్తుతం వచ్చిన పార్టీ సమన్వయకర్త ఏ ఊరికీ వెళ్లి ఎవరినీ కలవడంలేదని.. బంగ్లాకు రమ్మని పిలుస్తున్నారని, రానివారిని తీసేస్తున్నారని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్పై తనను పిలిచి అడిగేవారు లేరని, ఒకవేళ పిలిచినా వెళ్లి చేతులు కట్టుకుని నిలిచి సంజాయిషీ చెప్పే ఆలోచన లేదని స్పష్టంచేశారు. తనను రాజకీయంగా నిర్వీర్యం చేసేందుకు చూస్తున్నారని.. శక్తి ఉంటే లేస్తానని, లేకుంటే కింద పడిపోతానని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం