గుజరాత్లో ‘ఫసల్ బీమా’ ఎందుకు అమలు చేయరు?
తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలుచేయాలని అడుగుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ముందు ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలుచేయడం లేదో చెప్పగలరా అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు.
సంజయ్కు మంత్రి హరీశ్ ప్రశ్న
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఫసల్ బీమా యోజన అమలుచేయాలని అడుగుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ముందు ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎందుకు అమలుచేయడం లేదో చెప్పగలరా అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ‘‘దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయనే విషయాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదన్నది దీన్నిబట్టి అర్థం కావడం లేదా?’’ అంటూ బండి సంజయ్ను ఉద్దేశించి మంత్రి హరీశ్రావు శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.228 కోట్లు సాయం ప్రకటించి రైతుబిడ్డ అని మరోసారి నిరూపించుకున్నారు. భాజపా నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఎక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ.. నేడు అదానీ ఆదాయాన్ని డబుల్ చేశారు. పంటల సాగు, రైతు సంక్షేమం గురించి భాజపా నేతలు మాట్లాడటం హాస్యాస్పదం’’ అంటూ ట్విటర్ వేదికగా హరీశ్రావు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.