పేదలకు అందని ద్రాక్షలా విద్య, వైద్యం
భారాస పాలనలో పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు.
జోడో యాత్రలో భట్టి విక్రమార్క విమర్శ
బెల్లంపల్లి గ్రామీణం, న్యూస్టుడే: భారాస పాలనలో పేదలకు విద్య, వైద్యం అందని ద్రాక్షలా మారాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శుక్రవారం నిర్వహించిన హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విద్యను పటిష్ఠం చేయాల్సిన యంత్రాంగం, మౌలిక వసతుల కల్పనపై చిన్నచూపు చూస్తోందన్నారు. బెల్లంపల్లి డిగ్రీ కళాశాలలో 800 మంది విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నా.. సరిపడినన్ని మరుగుదొడ్లు లేకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు వస్తే గేట్లు తీయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం