Bhimavaram: భీమవరంలో జనసేన-వైకాపా ఫ్లెక్సీ వార్
పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు.
జనసేన జిల్లా అధ్యక్షుడి అరెస్టుతో ఉద్రిక్తం
భీమవరం పట్టణం, న్యూస్టుడే: పశ్చిమగోదావరి జిల్లాలో ఫ్లెక్సీల వివాదం ఆందోళనలకు దారితీసింది. వైకాపా నాయకులు ఇటీవల పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేశ్ కూర్చున్న పల్లకీని జనసేన అధినేత పవన్ కల్యాణ్, మరికొందరు మోస్తున్నట్లు కార్టూన్ ఉండటం అభ్యంతరకరంగా ఉందని జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మే 26న కలెక్టర్ పి.ప్రశాంతికి వినతి పత్రం అందజేశారు. పురపాలక, పోలీసు అధికారులకు వినతులు ఇచ్చారు. అయినా ఫ్లెక్సీలను తొలగించలేదు. మరోవైపు జనసేన ముద్రించిన ఫ్లెక్సీలను భీమవరంలో ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం గురువారం భీమవరంలోని తన కార్యాలయంలో గోవిందరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనసేన శ్రేణులు జిల్లా వ్యాప్తంగా తరలి వస్తారని భావించిన పోలీసులు గోవిందరావును ఆయన నివాసంలో గురువారం ఉదయం 5.30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు.
తనకు 41ఏ నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం ఏమిటంటూ తన ఇంటికి వచ్చిన సీఐలు, ఎస్ఐలను గోవిందరావు ప్రశ్నించారు. అయినా వినకుండా ఆయనను అదుపులోకి తీసుకోవడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గోవిందరావును తీసుకెళ్తున్న వాహనాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయినా వారిని తప్పించుకుని వాహనాన్ని పోనివ్వడంతో జన సైనికులు ద్విచక్రవాహనాలపై వెంబడించారు. ఆయనను పోడూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జనసేన పిలుపుతో జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలూ జరిగాయి. మరోవైపు జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పోడూరు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నరసాపురం డీఎస్పీ మనోహరచారి, పాలకొల్లు గ్రామీణ సీఐ కె.శ్రీనివాస్లు గోవిందరావుతో మాట్లాడిన అనంతరం 10.45 గంటల సమయంలో విడిచిపెట్టారు. అక్రమ నిర్బంధాలు దారుణమని భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. కొటికలపూడి గోవిందరావు నివాసానికి వెళ్లి ఆయన సంఘీభావం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం