మైనారిటీలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తా
మైనారిటీలకు అండగా ఉంటానని, మీరు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు.
హజ్ యాత్రికులతో మాజీ సీఎం చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే నరేంద్రను అడ్డుకున్న పోలీసులు
ఈనాడు, అమరావతి: మైనారిటీలకు అండగా ఉంటానని, మీరు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.145 కోట్లతో హజ్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, దాని నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం కొనసాగించలేదని తెలిపారు. తాము అధికారంలోకి వస్తే ముస్లిం, మైనారిటీలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు భారతదేశం గర్వపడే విధంగా హజ్హౌస్ను నిర్మించి మీ రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నంబూరు మదర్సా నుంచి హజ్ యాత్రకు వెళుతున్నవారిని గురువారం రాత్రి ఆయన కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ముంబయి, బెంగళూరు వెళ్లి హజ్యాత్రకు వెళ్లేవారు. ఆ పరిస్థితి లేకుండా నేరుగా హైదరాబాద్ నుంచి వెళ్లేలా అసెంబ్లీ ఎదురుగా హజ్ హౌస్ కట్టాం. అది మా చిత్తశుద్ది’ అని చంద్రబాబు గుర్తు చేశారు. యాత్రకు వెళ్లే వారికి కిట్ ఇచ్చి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జలీల్ఖాన్, ధూళిపాళ్ల నరేంద్ర, మాజీమంత్రి పుల్లారావు, గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నసీర్ అహ్మద్తో పాటు పలువురు మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.
ధూళిపాళ్ల నరేంద్రను అడ్డుకున్న పోలీసులు
తెదేపా నాయకుడు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను మదర్సా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు రాకను పురస్కరించుకుని నియోజకవర్గంలోని మైనారిటీ నాయకులతో కలిసి ఆయన తొలుత అక్కడికి చేరుకున్నారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పెదాకాకాని ఎస్సై ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో తనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆమెతో మాట్లాడుతుండగానే సీఐ సురేష్బాబు సైతం వచ్చి అడ్డుకోబోయారు. దీంతో నరేంద్ర మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నరేంద్ర ఒక్కరే వెళ్లాలని సీఐ కోరారు. తనతో పాటు ఉన్నవారందరినీ అనుమతించాక ఆయన లోపలికి వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434