కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ పనులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి: షబ్బీర్ అలీ
కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని మాజీమంత్రి షబ్బీర్అలీ డిమాండ్ చేశారు.
సదాశివనగర్, న్యూస్టుడే: కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 22 ప్యాకేజీ పనులకు ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని మాజీమంత్రి షబ్బీర్అలీ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం భూంపల్లిలో చేపట్టిన ప్యాకేజీ పనులను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘చలో భూంపల్లి’ కార్యక్రమం చేపట్టారు. దీనికి షబ్బీర్ అలీ హాజరై పనులను పరిశీలించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తిచేయకుండా భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ‘‘ భారాస ప్రభుత్వానికి కమీషన్లు దండుకోవడమే తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదు. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువులు, పంటనష్ట పరిహారం, పంటల బీమా తదితర హామీలు నెరవేర్చకుండానే దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను రద్దు చేస్తాం. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదని సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రి ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత అసత్య ప్రచారాలు చేస్తున్నారు. దమ్ముంటే ప్రజాదర్బార్లో తేల్చుకుందాం రండి’’ అని షబ్బీర్ అలీ సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు