Kanna Lakshminarayana: వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్రెడ్డి: కన్నా
కడప మాఫియా గ్యాంగ్ ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దిగి భూకబ్జాలు చేస్తోందని, ప్రశాంతమైన విశాఖను అరాచకాలు, భూకబ్జాలకు అడ్డాగా మార్చారని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
సత్తెనపల్లి, న్యూస్టుడే: కడప మాఫియా గ్యాంగ్ ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దిగి భూకబ్జాలు చేస్తోందని, ప్రశాంతమైన విశాఖను అరాచకాలు, భూకబ్జాలకు అడ్డాగా మార్చారని మాజీ మంత్రి, తెదేపా నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రను, ముఖ్యంగా అభివృద్ధి చెందిన విశాఖను దోచుకుతినడానికే వైకాపా మూడు రాజధానులు అంటోందన్నారు. ‘విశాఖలో బతకలేమని సొంత పార్టీ ఎంపీలే హైదరాబాద్కు వెళ్తున్నారు. ఇలాంటి అరాచక పాలన చూడలేదని వైకాపా ఎమ్మెల్యేలే చెబుతున్నారు. వంద మంది రాజారెడ్డిలు కలిస్తే ఒక జగన్మోహన్రెడ్డి. గతంలో కడప లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరించినప్పుడే ఈ విషయం నా దృష్టికి వచ్చింది. జగన్ 16 నెలలు జైల్లో ఉంటే, అతడి తల్లి, చెల్లి రాష్ట్రమంతా తిరిగారు. ఇప్పుడు వారు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. చెల్లిని, తల్లిని నమ్మని జగన్ను రాష్ట్ర ప్రజలు మాత్రం ఎందుకు నమ్మాలి?’ అని కన్నా ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి ధైర్యంగా ప్రజల్లోకి రావడం లేదు. ఆయన హెలికాప్టర్లో వస్తుంటే నేలపై వందేళ్ల నాటి చెట్లు కొట్టేస్తున్నారు. రాష్ట్ర సంపదను గంపగుత్తగా జగన్ వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారు. ధన, మాన, ప్రాణాల్ని కాపాడలేని ఈ ప్రభుత్వాన్ని మళ్లీ తెచ్చుకోవద్ద’ని ప్రజలకు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని వడ్డేపాళ్యం గ్రామంలో ఆదివారం రాత్రి నిర్వహించిన తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి జరిగింది. -
ఆమెను చూసి ‘నెహ్రూ’ ఆత్మ కన్నీరు పెడుతుంది: మధ్యప్రదేశ్ సీఎం
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఆమె ఇంటి పేరు ప్రస్తావిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!