జైలుకెళ్లిన ఏ నాయకుడైనా తిరిగి అధికారంలోకి రాలేరు: మంత్రి అంబటి

‘దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉండి తప్పు చేసి జైలుకెళ్లారు. జైలుకెళ్లిన ఏ నాయకుడైనా బతికిబట్ట కట్టలేదు, తిరిగి అధికారంలోకి రాలేదు.

Updated : 07 Oct 2023 08:52 IST

నకరికల్లు, న్యూస్‌టుడే: ‘దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉండి తప్పు చేసి జైలుకెళ్లారు. జైలుకెళ్లిన ఏ నాయకుడైనా బతికిబట్ట కట్టలేదు, తిరిగి అధికారంలోకి రాలేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్‌ కల్యాణ్‌ మద్దతిచ్చి మునిగిపోయే పడవను లేపుతామని చెప్పటం విడ్డూరంగా ఉంది’ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. నకరికల్లులోని వైకాపా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంపై వాలంటీర్లు, గృహసారథులు, కన్వీనర్ల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి చంద్రబాబే కారణమన్నారు. చంద్రబాబు జైలుకుపోవడంతో తెదేపా బలహీనపడిందని పవన్‌, సానుభూతి పెరిగిందని తెదేపా చెబుతున్నారన్నారు. పవన్‌కు డబ్బు అవసరం లేదంటూనే ఎందుకు తెదేపాకు మద్దతు పలుకుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. రెండుచోట్లా ఓడిపోయిన పవన్‌కు ఒక్క సీటు కూడా రాదని, వైకాపా 175 సీట్లలో గెలవటం ఖాయమని జోస్యం చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని