కావాలనే నాపై దుష్ప్రచారం: వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

శాసనసభ సభ్యత్వానికి, వైకాపాకు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో సోమవారం గట్టి ప్రచారం జరిగింది.

Updated : 12 Dec 2023 07:17 IST

మైలవరం, న్యూస్‌టుడే: శాసనసభ సభ్యత్వానికి, వైకాపాకు ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో సోమవారం గట్టి ప్రచారం జరిగింది. దీనిపై జి.కొండూరు పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేను న్యూస్‌టుడే సంప్రదించగా తాను రాజీనామా చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, ఆ ప్రచారంతో తనకు సంబంధం లేదన్నారు. కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నానని, లంక భూములకు పట్టాలు పంచానని ఎమ్మెల్యే వివరించారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని