Nara Lokesh: సాక్షి గణపతిని దర్శించుకున్న నారా లోకేశ్‌

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీశైలం పర్యటనకు వచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి చేరుకున్నారు.

Updated : 01 Feb 2024 12:40 IST

సున్నిపెంట సర్కిల్‌: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీశైలం పర్యటనకు వచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి కర్నూలు జిల్లా సున్నిపెంట హెలిప్యాడ్‌ వద్దకు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, తెదేపా నేతలు ఎన్‌ఎండీ ఫరూక్‌, రాజశేఖర్‌రెడ్డి, పలువురు జనసేన నేతలు స్వాగతం పలికారు. అనంతరం సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి సాక్షి గణపతి స్వామిని లోకేశ్‌ దర్శించుకున్నారు. అనంతరం శ్రీశైలం ఆలయంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని